తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముంది. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో చోటు ఉంటుందని సమాచారం. ఓసీ సామాజిక వర్గానికి లేకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. సుదర్శన్రెడ్డికి మంత్రివర్గంలో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే కసరత్తు చేసిన పేర్లను పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి మంత్రివర్గంలోకి తీసుకునేవారి పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ్శర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు నాలుగైదు ముహుర్తాలు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పేర్లు నిర్ధరణ అయ్యాక.. ఏ ముహుర్తంలో ప్రమాణస్వీకారం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు.