Press "Enter" to skip to content

NEET UG Results 2025: నీట్‌ (యూజీ) ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..

NEET UG Results 2025: నీట్‌ యూజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

By Features Desk
Updated : 14 Jun 2025 13:53 IST

Ee

Font size

  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

1 min read

NEET UG Results| దిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్‌ (యూజీ) ఫలితాలు వచ్చేశాయ్‌.. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2025) ఫలితాలను ఎన్‌టీఏ(NTA) అధికారులు శనివారం విడుదల చేశారు. మే 4న జరిగిన నీట్‌ (యూజీ) పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు.. తాజాగా ఫలితాలను ప్రకటించారు.

స్కోర్‌ కార్డు కోసం అభ్యర్థులు తమ ఈమెయిళ్లను చెక్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ వెల్లడించింది. లేదంటే.. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా అప్లికేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

నీట్‌ స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..

ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు.  తెలంగాణ నుంచి 41,584 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 36,776 మంది నీట్‌లో అర్హత సాధించారు. తెలంగాణ నుంచి కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ 18వ ర్యాంక్‌, షణ్ముఖ నిషాంత్‌ 37వ ర్యాంక్‌, మంగరి వరుణ్‌ 46వ ర్యాంక్‌, యండ్రపాటి షణ్ముఖ్‌ 48వ ర్యాంక్‌ సాధించారు. ఏపీ నుంచి దర్బా కార్తీక్‌రామ్‌కు 19వ ర్యాంక్‌, కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ 56వ ర్యాంక్‌ దక్కించుకున్నారు.

దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌ (BDS), బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4న ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 20లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.


Published : 14 Jun 2025 13:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి
సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు
యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు
లేదు.

Source link