క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్టు అయ్యారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్కి తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.