Press "Enter" to skip to content

తిరుమలలో భక్తులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

తిరుమలలో భక్తులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు తితిదే ధర్మరథాలతో పాటుగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.

జెండా ఊపి ఆర్టీసీ సర్వీసును ప్రారంభిస్తున్న వెంకయ్యచౌదరి, ఆర్టీసీ అధికారులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో భక్తులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు తితిదే ధర్మరథాలతో పాటుగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల ఉచిత సర్వీసును స్థానిక అశ్విని ఆసుపత్రి కూడలిలో గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘తిరుమలలో ప్రైవేట్‌ వాహనాల అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు ఈ ఆర్టీసీ ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయి. శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులూ సేవలు అందిస్తాయి. సగటున మూడు-నాలుగు నిమిషాలకో బస్సు ప్రతి స్టాప్‌లో భక్తులకు అందుబాటులో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ పైడి చంద్రశేఖర్, తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, తిరుపతి ప్రజారవాణా అధికారి వెంకటరావు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Source link