Press "Enter" to skip to content

YSRCP leaders: వైకాపా నాయకుల పైశాచికం

వైకాపా నాయకులు, కార్యకర్తల తీరు మాత్రం మారడం లేదు..మీ పాలన మాకొద్దు అని ప్రజలు తిప్పికొట్టినా.. ఇసుమంతైనా మార్పులేదు.

బాలుడి సైకిల్‌ లాక్కుని ధ్వంసం

సైకిల్‌ను కిందపడేసి తొక్కుతూ.. 

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు, కార్యకర్తల తీరు మాత్రం మారడం లేదు..మీ పాలన మాకొద్దు అని ప్రజలు తిప్పికొట్టినా.. ఇసుమంతైనా మార్పులేదు. మా ప్రవర్తన మాదే..మేమింతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఇందుకు ఉదాహరణే గురువారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట శుభకార్యానికి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు చేసిన వీరంగం.. దారి వెట వెళ్తున్న బాలుడి సైకిల్‌ లాక్కుని దారుణంగా ప్రవర్తించారు. సైకిల్‌ను గాల్లో తిప్పి..నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు.. ఓ పక్క ఆ పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ శనివారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ గా మారాయి. దీంతో ఆ వీడియోలు చూసిన స్థానిక కౌన్సిలర్లు, నాయకులు మండిపడ్డారు. ఈ వీడియోను విద్యా శాఖా మంత్రి లోకేశ్‌ కార్యాలయానికి, మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌కు పంపారు. తమ పార్టీ గుర్తును అవమానించారని, కిందపడేసి తొక్కారని, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలను పోలీసులకు కూడా సమర్పించడంతో వాటి ఆధారంగా కొందరిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకొన్నామని సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.  

Source link