తిరుమలలో భక్తులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు తితిదే ధర్మరథాలతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.
జెండా ఊపి ఆర్టీసీ సర్వీసును ప్రారంభిస్తున్న వెంకయ్యచౌదరి, ఆర్టీసీ అధికారులు
తిరుమల, న్యూస్టుడే: తిరుమలలో భక్తులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు తితిదే ధర్మరథాలతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల ఉచిత సర్వీసును స్థానిక అశ్విని ఆసుపత్రి కూడలిలో గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘తిరుమలలో ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు ఈ ఆర్టీసీ ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయి. శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులూ సేవలు అందిస్తాయి. సగటున మూడు-నాలుగు నిమిషాలకో బస్సు ప్రతి స్టాప్లో భక్తులకు అందుబాటులో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ పైడి చంద్రశేఖర్, తితిదే ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, తిరుపతి ప్రజారవాణా అధికారి వెంకటరావు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్ పాల్గొన్నారు.