08 Jun 2025 | 17:44 IST
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్..
కాకినాడ: ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025(AP EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది, అగ్రి-ఫార్మసీ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు ‘మరిన్ని వివరాలు’లో..